రెండు సాక్షరభారత్ అవార్డులను కైవశం చేసుకున్న తెలంగాణా
- September 08, 2016
దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సాక్షరభారత్ అవార్డులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రెండు సాక్షరభారత్ అవార్డులు సాధించింది. ఎంపీ వినోద్ దత్తత గ్రామం వీరన్నపల్లి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి దత్తత గ్రామం బకారం అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు గ్రామాల సర్పంచులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 15-50ఏళ్ల మధ్య వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షరభారత్ పతకాన్ని ప్రవేశపెట్టింది.ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధిలో వీరన్నపల్లి 11వ స్థానంలో నిలవడం విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







