రెండు సాక్షరభారత్ అవార్డులను కైవశం చేసుకున్న తెలంగాణా

- September 08, 2016 , by Maagulf
రెండు సాక్షరభారత్ అవార్డులను కైవశం చేసుకున్న తెలంగాణా

దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సాక్షరభారత్‌ అవార్డులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రెండు సాక్షరభారత్‌ అవార్డులు సాధించింది. ఎంపీ వినోద్‌ దత్తత గ్రామం వీరన్నపల్లి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి దత్తత గ్రామం బకారం అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు గ్రామాల సర్పంచులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 15-50ఏళ్ల మధ్య వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షరభారత్‌ పతకాన్ని ప్రవేశపెట్టింది.ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధిలో వీరన్నపల్లి 11వ స్థానంలో నిలవడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com