పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని : కేటీఆర్

- September 08, 2016 , by Maagulf
పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని : కేటీఆర్

 అంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినట్టే తమ రాష్ట్రానికి కూడా సహకరించాలని కేంద్రాన్ని తాను అడిగినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలా కాకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలిపానన్నారు. అరుణ్ జైట్లీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తాను కోరినట్లు చెప్పిన కేటీఆర్, నీతి ఆయోగ్ సూచన మేరకు మిషన్ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.24,500 కోట్లు ఇవ్వాలని కోరానన్నారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఐదేళ్ళ పాటు ఇవ్వాలని కూడా అడిగానన్నారు. ఇంకా హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్‌- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని అడిగామన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com