సెన్సార్ పూర్తి చేసుకున్న 'శ్రీమంతుడు'
- August 04, 2015
సూపర్ స్టార్ శ్రీమంతుడు 'సెన్సార్' కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారట. అలాగే ఈ చిత్ర నిర్మాతలను కూడా పొగడ్తలతో ముంచెత్తారట. ''చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి విలువలు వున్న సినిమా చూశా౦. మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా చూసి చాలా కాలమైందని'' నిర్మాతలను మెచ్చుకున్నారట. ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమలో కుటుంబ బంధాల గురించి.. మానవతా విలువల గురించి వర్ణిస్తూ.. గ్రామాల ప్రాధాన్యతను కూడా తెలియచేసేలా అద్భుతంగా వచ్చిందట. బేసికల్ గా మన సూపర్ స్టార్ కి ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సినిమాలో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెబుతున్నారు. తెలుగులో ప్రమోషన్లతో దూసుకుపోతున్న 'శ్రీమంతుడు', నేటి నుంచి తమిళంలో ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఈ సందర్భంగా 'సెల్వందన్' ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్,దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







