సెన్సార్ పూర్తి చేసుకున్న 'శ్రీమంతుడు'
- August 04, 2015
సూపర్ స్టార్ శ్రీమంతుడు 'సెన్సార్' కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారట. అలాగే ఈ చిత్ర నిర్మాతలను కూడా పొగడ్తలతో ముంచెత్తారట. ''చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి విలువలు వున్న సినిమా చూశా౦. మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా చూసి చాలా కాలమైందని'' నిర్మాతలను మెచ్చుకున్నారట. ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమలో కుటుంబ బంధాల గురించి.. మానవతా విలువల గురించి వర్ణిస్తూ.. గ్రామాల ప్రాధాన్యతను కూడా తెలియచేసేలా అద్భుతంగా వచ్చిందట. బేసికల్ గా మన సూపర్ స్టార్ కి ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సినిమాలో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెబుతున్నారు. తెలుగులో ప్రమోషన్లతో దూసుకుపోతున్న 'శ్రీమంతుడు', నేటి నుంచి తమిళంలో ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఈ సందర్భంగా 'సెల్వందన్' ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్,దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







