సెన్సార్ పూర్తి చేసుకున్న 'శ్రీమంతుడు'
- August 04, 2015
సూపర్ స్టార్ శ్రీమంతుడు 'సెన్సార్' కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారట. అలాగే ఈ చిత్ర నిర్మాతలను కూడా పొగడ్తలతో ముంచెత్తారట. ''చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి విలువలు వున్న సినిమా చూశా౦. మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా చూసి చాలా కాలమైందని'' నిర్మాతలను మెచ్చుకున్నారట. ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమలో కుటుంబ బంధాల గురించి.. మానవతా విలువల గురించి వర్ణిస్తూ.. గ్రామాల ప్రాధాన్యతను కూడా తెలియచేసేలా అద్భుతంగా వచ్చిందట. బేసికల్ గా మన సూపర్ స్టార్ కి ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సినిమాలో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెబుతున్నారు. తెలుగులో ప్రమోషన్లతో దూసుకుపోతున్న 'శ్రీమంతుడు', నేటి నుంచి తమిళంలో ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఈ సందర్భంగా 'సెల్వందన్' ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్,దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









