ఫిదా రెండో షెడ్యూల్ అమెరికాలో..
- September 09, 2016
వరుణ్తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫిదా' . సాయిపల్లవి కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్రాజు నిర్మిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ను పూర్తిచేసుకుని యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన పాత్రలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ విషయాన్ని వరుణ్ ట్వీట్ చేయడంతో పాటు కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలు కానున్నట్లు, దానిని కథాపరంగా అమెరికాలో చిత్రీకరిస్తారని, అందుకు అనుగుణంగానే చిత్రబృందం అమెరికా ప్రయాణానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అమెరికా అబ్బాయికి..తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







