మరో హర్రర్ సినిమాలో త్రిష
- September 11, 2016
ఒకప్పుడు లవ్, ఫ్యామిలీ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి చూపించిన త్రిష ప్రస్తుతం హర్రర్ సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న నాయకి సినిమాతో భయపెట్టిన త్రిష తాజాగా మోహిని అనే లేడి ఓరియెంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. త్రిష ద్విపాత్రాభినయం చేసిన నాయకి చిత్రం తెలుగులో ఇటీవల తెరపైకి రాగా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. త్వరలో ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక తాజాగా మరో హారర్ చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా ఆ సినిమా ఉండనున్నట్టు సమాచారం. ఇందులోనూ ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేయనున్నారట.మరి ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







