ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర..
- September 11, 2016
ఇటీవల జనతా గ్యారేజ్తో హ్యట్రిక్ విజయం అందుకున్న ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. దర్శకుడు ఎవరనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయిన త్వరలో 27వ సినిమాను ప్రారంభించాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించి ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. సినిమాలో కథకు అనుగుణంగా ఓ గెస్ట్ పాత్ర ఉండగా ఆ రోల్లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని యూనిట్ డిసైడ్ అయిందట. కళ్యాణ్ రామ్తో ఎన్టీఆర్కి ఉన్న సాన్నిహిత్యం వలన జూనియర్ కూడా ఓకే అన్నారని చెబుతున్నారు.ఇటీవల విడుదలైన ఇజం టీజర్కి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడనే విషయం నిజమే అయితే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోండగా ఇజంలో జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







