ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర..
- September 11, 2016
ఇటీవల జనతా గ్యారేజ్తో హ్యట్రిక్ విజయం అందుకున్న ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రంపై ఫోకస్ చేస్తున్నాడు. దర్శకుడు ఎవరనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయిన త్వరలో 27వ సినిమాను ప్రారంభించాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించి ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇజం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. సినిమాలో కథకు అనుగుణంగా ఓ గెస్ట్ పాత్ర ఉండగా ఆ రోల్లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని యూనిట్ డిసైడ్ అయిందట. కళ్యాణ్ రామ్తో ఎన్టీఆర్కి ఉన్న సాన్నిహిత్యం వలన జూనియర్ కూడా ఓకే అన్నారని చెబుతున్నారు.ఇటీవల విడుదలైన ఇజం టీజర్కి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడనే విషయం నిజమే అయితే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోండగా ఇజంలో జగపతి బాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...







