సిరియాలో వైమానిక దాడులు, 100 పైగా మృతి
- September 11, 2016
సిరియాలో బాంబుల వర్షం కురిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ దారుణ సంఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ అధా సందర్భంగా సోమవారం నుంచి 10 రోజుల పాటు కాల్పులు జరపరాదని అమెరికా, రష్యా శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తిరుగుబాటుదారుల ప్రాబల్యంలో ఉన్న ఇడ్లిబ్, అలెప్పో నగరాలపై వైమానిక దాడులు జరిగాయని ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ దాడుల్లో ఇడ్లిబ్లో దాదాపు 60 మంది, అలెప్పోలో సుమారు 45 మంది మరణించారని తెలిపారు. ఐసిస్, అల్ ఖైదాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అమెరికా, రష్యా సైనిక భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిరియాలోని జీహాదీ ఉగ్రవాదులపై సమన్వయంతో వైమానిక దాడులు చేయడానికి నిర్ణయించుకున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలపై కొత్త పరిమితులు విధించాయి. అమెరికా హోం శాఖ కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడుతూ అమెరికా, రష్యా ఓ ప్రణాళికను ప్రకటిస్తున్నాయన్నారు. సిరియాలో హింసను తగ్గించేందుకు, శాంతి, రాజకీయ మార్పుకోసం ఈ ప్రణాళిక దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







