విమానంలో 'అల్లాహ్ అక్బర్'.. 'మరణం సమీపిస్తోంది' అని అరుపులు
- September 11, 2016
గాల్లో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా చేతికి బేడీలు ఉన్న వ్యక్తి 'అల్లాహ్ అక్బర్'.. 'మరణం సమీపిస్తోంది' అని బిగ్గరగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంగ్లాండ్లోని గాట్విక్ నుంచి వెనిస్ బయలుదేరిన ఈజీజెట్ ఈజెడ్వై5263 విమానంలో ఈ ఘటన జరిగినట్లు బ్రిటీష్ హోం ఆఫీస్ అధికారులు వెల్లడించారు. అక్రమ వలసదారులను తరలిస్తున్న విమానంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చేతికి బేడీలు ఉన్న ఆ వ్యక్తి 29 సార్లు అల్లాహ్ అక్బర్, 17 సార్లు మరణం సమీపిస్తోంది, మనం అందరం చనిపోబోతున్నాం అని తొమ్మిది సార్లు అరిచినట్లు ప్రయాణికులు వెల్లడించారు.
అతడి కేకలతో భయపడిపోయిన ప్రయాణికులు, చిన్నారులు ఏడ్వడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన అధికారులు అతడ్ని అరవకుండా అదుపు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







