విదేశాల్లో నూ పతంజలి స్టోర్స్.!
- September 11, 2016
ఇప్పటికే దేశంలో శరవేగంగా మార్కెట్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి సంస్థ ఇప్పుడు విదేశాల్లోను వ్యాపారానికి సిద్ధమవుతోంది. ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులు విదేశాల్లో కూడా విక్రయించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రొడక్ట్స్ యజమాని, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ లో తమ వ్యాపార సంస్థల ఏర్పాటుకు, మధ్యాసియాలో ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామన్నారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో కూడా అడుగుపెడతామని రాందేవ్ తెలిపారు. సౌదీ అరేబియాలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో మాత్రం రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తామన్నారు. 90శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్ బైజాన్ లోనూ తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని, అక్కడి వ్యాపార వేత్తలు కూడా వాటిని బాగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, పతంజలి గార్మెంట్స్ రంగంలో కూడా అడుగుపెట్టి విదేశాల్లో స్వదేశీ జీన్స్ పేరిట విక్రయిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







