విదేశాల్లో నూ పతంజలి స్టోర్స్.!
- September 11, 2016
ఇప్పటికే దేశంలో శరవేగంగా మార్కెట్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి సంస్థ ఇప్పుడు విదేశాల్లోను వ్యాపారానికి సిద్ధమవుతోంది. ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులు విదేశాల్లో కూడా విక్రయించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రొడక్ట్స్ యజమాని, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చెప్పారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ లో తమ వ్యాపార సంస్థల ఏర్పాటుకు, మధ్యాసియాలో ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశామన్నారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో కూడా అడుగుపెడతామని రాందేవ్ తెలిపారు. సౌదీ అరేబియాలో కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లో మాత్రం రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తామన్నారు. 90శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్ బైజాన్ లోనూ తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నామని, అక్కడి వ్యాపార వేత్తలు కూడా వాటిని బాగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, పతంజలి గార్మెంట్స్ రంగంలో కూడా అడుగుపెట్టి విదేశాల్లో స్వదేశీ జీన్స్ పేరిట విక్రయిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







