'ఎంఎస్ ధోని' 30న విడుదల ..
- September 12, 2016
భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా, విజయవంతమైన కెప్టెన్గా, ఝార్ఖండ్ డైనమైట్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఎస్ ధోని. ప్రస్తుతం ఆయన జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న సినిమా 'ఎంఎస్ ధోని'. 'అన్ టోల్డ్ స్టోరీ' అన్నది టాగ్లైన్. ఈ చిత్రానికి నీరజ్పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్సింగ్ ఇందులో ధోనిగా నటిస్తున్నారు. కియారా అద్వాని, అనుపమ్ కౌర్, భూమికాచావ్లా, రాజేష్ శర్మ ఇతర తారాగణం. ప్రసుత్తం ఈ సినిమా తమిళంలో కూడా విడుదలవుతోంది. ధోనికి తమిళనాట పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందులోనూ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ఆయనే సారథి కావడంతో..ఇక్కడి క్రీడాభిమానులకు ధోని అంటే 'మనోడే' అన్నంతగా అభిమానం చూపుతారు. అందుకే ఈ చిత్రంపై కోలీవుడ్లోనూ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. 150 పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.అదేవిధంగా చెన్నైలోని కొన్ని థియేటర్లలో హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







