స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్కు ఆస్ట్రేలియా ముఖ్యమైన మార్పులు..
- September 12, 2016
స్కిల్డ్ మైగ్రేషన్ ప్రోగ్రామ్కు ఆస్ట్రేలియా ముఖ్యమైన మార్పులు చేసింది. ఆస్ట్రేలియా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అదనంగా 5 పాయింట్లు ఇస్తోంది. ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో డాక్టరేట్ లెవెల్, మాస్టర్స్ లెవెల్ రీసెర్చ్ క్వాలిఫికేషన్లు ఉన్న విద్యార్థులకు ఈ అదనపు పాయింట్లు ఇస్తోంది. అత్యుత్తమ, గొప్ప తెలివైన నైపుణ్యంగలవారిని ఆస్ట్రేలియా వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఎంటర్ప్రెన్యూవర్ వీసా బిజినెస్ ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా కొత్త ఎంటర్ప్రెన్యూవర్ వీసా కోసం దరఖాస్తులను అనుమతిస్తున్నారు.
2 లక్షల డాలర్ల థర్డ్ పార్టీ ఫండింగ్తో ఎంటర్ప్రెన్యూవర్లకు ఇది ఉపయోగపడుతుంది. వీరు తమ సృజనాత్మక ఆలోచనలతో ఆస్ట్రేలియాలో వ్యాపారం చేయవచ్చు. ఈ వీసా ఆస్ట్రేలియాలో పర్మినెంట్ రెసిడెన్సీకి కూడా బాటలు వేస్తుంది. ఎంటర్ప్రెన్యూవర్ వీసా పొందడానికి అర్హతలు ఏమిటంటే...
అభ్యర్థి వయసు 55 ఏళ్ళ లోపు ఉండాలి.
ఇంగ్లిష్లో కాంపిటెంట్ లెవెల్ పరిజ్ఞానం ఉండాలి.
ఆస్ట్రేలియాలో ఎంటర్ప్రెన్యూవరియల్ వెంచర్ను అభివృద్ధి చేయడానికి కనీసం 2 లక్షల డాలర్ల అగ్రిమెంట్ కలిగియుండాలి.
ఈ ఎంటర్ప్రెన్యూరియల్ వెంచర్లో కనీసం 30 శాతం ప్రయోజనాన్ని కలిగియుండాలి.
అభ్యర్థిని స్టేట్ లేదా టెర్రిటరీ గవర్నమెంట్ నామినేట్ చేయాలి.
కామన్వెల్త్ ఏజెన్సీలు, స్టేట్, టెర్రిటరీ గవర్నమెంట్, రీసెర్చ్ ఆర్గనైజేషన్లు, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తుదారులు ఫండింగ్ పొందవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







