రియల్ లైఫ్లో ప్రత్యర్థులుగా సీనియర్ నటులు...
- September 12, 2016
ఇద్దరు నటులు రైవల్స్గా మారిపోయారు. దీనికి నడిగర్ సంఘం వేదికైంది. ఆ సొసైటీలో కోటిన్నర రూపాయల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆ సంఘం మాజీ అధ్యక్షుడు, నటుడు శరతకుమార్పై హైకోర్టుకి ఎక్కాడు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్. 9 ఏళ్ల కాలంలో శరత్ కుమార్, రాధారవితోపాటు మరోవ్యక్తిపై కూడా నిధులను దుర్వినియోగం చేశారని అందులో ప్రస్తావించారు. మార్చి 3న సిటీ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందులో ప్రస్తావించాడు నాజర్. ఈ పిటిషన్ త్వరలో న్యాయస్థానం ముందుకు విచారణకు రానుంది.నిధుల దుర్వినియోగంపై న్యాయస్థానం విచారణకు ఆదేశిస్తే శరత్కుమార్కు చిక్కులు తప్పదంటూ కోలీవుడ్లో చర్చ జరుగుతోంది.ఈ వివాదం ఇప్పటిదికాదని అంటున్నారు. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల నుంచి నిధుల దుర్వినియోగంపై శరత్కుమార్.. నాజర్ వర్గాలపై మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. గడిచిన కొన్నేళ్లుగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగావున్న శరత్కుమార్, ఈసారి ఘోరంగా ఓలమిపాలైయ్యాడు.దీంలో ఆ సంఘంలోని లోపాలను ప్రత్యర్థి వర్గం కదుపుతోంది. మొత్తానికి రీల్ లైఫ్ ఏమోగానీ.. రియల్ లైఫ్లో ప్రత్యర్థులుగా మారిపోయారు ఈ సీనియర్ నటులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







