`అరకు రోడ్ లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
- September 13, 2016
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `అరకు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను హైదరాబాద్లోని జె.ఆర్.సి. కన్వెన్షన్లో విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ను హీరో కళ్యాణ్రామ్ విడుదల చేశారు. బిగ్ సీడీని పూరి జగన్నాథ్, కళ్యాణ్రామ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను పూరి జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని కళ్యాణ్రామ్ కు అందించారు. పూరి సంగీత్ ద్వారా మార్కెట్లోకి పాటలు విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా..పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - అరకురోడ్లో థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే సినిమా కోసం టీం పడ్డ కష్టమంతా తెలుస్తుంది.చాలా బావుంది. గడ్డం సాంగ్ బావుంది. అన్నీ సాంగ్స్లో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్ వాసుదేవ్, నిర్మాతలు సహా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్.అన్నారు. హీరో కళ్యాణ్రామ్ మాట్లాడుతూ - రాం శంకర్ గత పదేళ్లుగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. హిట్ కోసం ట్రై చేస్తూ ముందడుగు వేయాలని సాయిరాం శంకర్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం తెల్లబడిపోతుందనే సాంగ్ను రాంశంకర్ ఎప్పుడో చూపించాడు. చూడగానే నచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా బావుంది. ఈ అరకు రోడ్లో సినిమా రాంశంకర్ కు మంచి బ్రేక్ తెస్తుందని భావిస్తున్నాను. దర్శకుడు వాసుదేవ్ చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. నిర్మాతలు సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్.. అన్నారు.రాం శంకర్, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







