మనుషుల్ని నరికి పండుగ చేసుకున్న ఐసిస్
- September 13, 2016
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) వేడుకులు జరుపుకొంటున్న తరుణాన ఐసిస్ ఉగ్రవాద సంస్థ దారుణానికి ఒడిగట్టింది. గొర్రెలకు బదులు బందీల పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో చిత్రీకరించినట్లుగా ఐసిస్ చెబుతోన్న వీడియోలో భారీ కాయుడైన జిహాదీ ఒకడు.. బందీలను దారుణంగా హతమార్చాడు. ఈ బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ నరికివేత వీడియోకు 'మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్'(వంచన చేయడం) అనే పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది.
గొర్రెలను వేలాడదీసే కొక్కేలకు బందీలను తలకిందులుగా వేలాడదీసి, పదునైన కత్తితో పీకలుకోశారు. 'ఇది ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన వీడియో'అని సిరియన్ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అంటున్నారు.12 నిమిషాల నిడివిగల వీడియోలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ను వినియోగించి పారిస్ ఈఫిల్ టవర్, నీస్ ట్రక్కుదాడి, మిషన్ ఇంపాజిబుల్-5 సినిమాలోని కొన్ని దృశ్యాలను కూడా పొందుపర్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







