మనుషుల్ని నరికి పండుగ చేసుకున్న ఐసిస్
- September 13, 2016
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్(ఈదుల్ అజ్ హా) వేడుకులు జరుపుకొంటున్న తరుణాన ఐసిస్ ఉగ్రవాద సంస్థ దారుణానికి ఒడిగట్టింది. గొర్రెలకు బదులు బందీల పీకలు తెగకోసి ఆ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఈశాన్య సిరియాలోని దెయిర్ అల్ జోర్ పట్టణంలోని ఒక జంతువధ శాలలో చిత్రీకరించినట్లుగా ఐసిస్ చెబుతోన్న వీడియోలో భారీ కాయుడైన జిహాదీ ఒకడు.. బందీలను దారుణంగా హతమార్చాడు. ఈ బందీలంతా సిరియాలో అమెరికా సైన్యాల కోసం గూఢచర్యం చేసి పట్టుబడ్డవారని, అందుకే ఈ నరికివేత వీడియోకు 'మేకింగ్ ఆఫ్ ఇల్లూషన్'(వంచన చేయడం) అనే పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది.
గొర్రెలను వేలాడదీసే కొక్కేలకు బందీలను తలకిందులుగా వేలాడదీసి, పదునైన కత్తితో పీకలుకోశారు. 'ఇది ఐసిస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన వీడియో'అని సిరియన్ హక్కుల కార్యకర్త అబూ మొహమ్మద్ అంటున్నారు.12 నిమిషాల నిడివిగల వీడియోలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ను వినియోగించి పారిస్ ఈఫిల్ టవర్, నీస్ ట్రక్కుదాడి, మిషన్ ఇంపాజిబుల్-5 సినిమాలోని కొన్ని దృశ్యాలను కూడా పొందుపర్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









