ప్రధానితో ముగిసిన గవర్నర్ సమావేశం
- September 13, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించారు. ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజన అంశంతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలోని సంస్థల విభజనపై చర్చించేందుకు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశం గురించి ప్రధాని, గవర్నర్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కరవు, వర్షాల పరిస్థితి, ఏపీకి స్పెషల్ ప్యాకేజీ, కృష్ణానదిపై ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై ప్రధాని, గవర్నర్ చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







