ప్రధానితో ముగిసిన గవర్నర్ సమావేశం
- September 13, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించారు. ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజన అంశంతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలోని సంస్థల విభజనపై చర్చించేందుకు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశం గురించి ప్రధాని, గవర్నర్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కరవు, వర్షాల పరిస్థితి, ఏపీకి స్పెషల్ ప్యాకేజీ, కృష్ణానదిపై ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై ప్రధాని, గవర్నర్ చర్చించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









