అతి త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్
- September 13, 2016
మనామా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్ని పంపిణీ చేయనున్నట్లు మినిస్టర్ బాసిమ్ అల్హామర్ చెప్పారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పంపిణీని ప్రారంభించేందుకు మినిస్ట్రీ ఏర్పాట్లు చేస్తోంది. హౌసింగ్ మినిస్ట్రీకి చెందిన అధికారులు, సెలవురోజులు మరియు వారాంతాల్లో కూడా వర్క్ చేస్తున్నారనీ, లబ్దిదారులు, వెయిటింగ్ లిస్ట్ మీద కసరత్తులు చేస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈస్ట్ హిద్ ప్రాజెక్ట్ - ముహర్రాక్, రియాద్ అక్సర్ హజియాత్ ప్రాజెక్టులు - సదరన్ గవర్నరేట్ పరిధిలోనూ బ్లాక్ 609 ప్రాజెక్ట్ సిట్రా - క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోనూ ఈ హౌసింగ్ యూనిట్స్ పంపిణీ జరుగుతుంది. అల్హమర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మినిస్ట్రీ 3,000 యూనిట్స్ని ఈద్ అల్ ఫితర్ సమయంలో షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయడంలో సక్సీడ్ అయ్యిందని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







