ఎయిర్ అంబులెన్స్లో ఇండియాకి
- September 15, 2016
అబుదాబీ: బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఇండియాకి చెందిన ట్యాక్సీ డ్రైవర్ ఎలియాస్ జార్జ్ని అబుదాబీ నుంచి అతని స్వస్థలం ఇండియాలోని కోచికి తరలించేందుకోసం ఎయిర్ అంబులెన్స్ని వినియోగించనున్నారు. జులై 16న జార్జ్కి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, అబుదాబీలోని క్లీవ్ల్యాండ్ క్లినిక్లో చేర్చారు. అక్కడే అతనికి రెండు నెలలుగా వైద్య చికిత్స అందుతోంది. స్థానికంగా ఉన్న ఓ కంపెనీ, అతని వైద్య ఖర్చుల్ని భరిస్తోంది. అయితే ఆ సంస్థ పేరు వెల్లడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఆ సంస్థ తమను ఆదుకునేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమని జార్జ్ సోదరుడు ఆస్టిన్ బ్రూజ్ చెప్పారు. అబుదబీ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11 గంటల సమయంలో విమానం బయల్దేరనుంది జార్జ్తోపాటుగా. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సాయంత్రం 4.30 నిమాషాల సమయంలో చేరుకుంటుంది. ఈ ఎయిర్ అంబులెన్స్లో డాక్టర్, పారా మెడిక్ ఉంటారు. ఎయిర్ అంబులెన్స్ కోసం 130,000 దిర్హామ్లు ఖర్చు చేస్తున్నారు. జార్జ్ పనిచేస్తున్న సంస్థ ముందుగా ఎయిర్ అంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే 200,000 దిర్హామ్లకు కొటేషన్ ఇచ్చారు. అయితే ఆసుపత్రి వర్గాలు చొరవ తీసుకోవడంతో కాస్త తక్కువ ధరకే ఎయిర్ అంబులెన్స్ దక్కింది. ఇంకో వైపున పోలీసులు 30 కిలోమీటర్ల రోడ్ ట్రాఫిక్ని జార్జ్ కోసం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









