కర్ణాటకలో ఘోరం ...
- September 15, 2016
కావేరీ జలాల వివాదంతో హుమ్నాబాద్ ప్రాంతంలో ఆందోళనకారులు ఒక వోల్వో బస్సుకు నిప్పు పెట్టారు. దాంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. బస్సులో మరికొంతమంది ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా సమాచారం అందలేదు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 11 మందికి తీవ్రగాయాలు కాగా, పాటిల్ అనే ఒక అదనపు ఎస్పీ మరణించారని అంటున్నారు. ఒక లారీ, ఈ బస్సు ఢీకొన్నాయని, అందువల్ల బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం సంభవించిందని కర్ణాటక పోలీసులు చెబుతుండగా.. ప్రయాణికులు మాత్రం ఆందోళనకారులే నిప్పుపెట్టారని అంటున్నారు.బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
కావేరీ జలాల వివాదం సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తుండటంతో ఆ ప్రభావం కర్ణాటక మీద కూడా పడింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కనపడితే చాలు.. ఆందోళనకారులు వాటిని తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా ''టీఎన్'' అనుకుని ''టీఎస్'' రిజిస్ట్రేషన్ ఉన్న బస్సుకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







