'ఈడు గోల్డ్ ఎహే' ఆడియో రిలీజ్..
- September 16, 2016
డాన్సింగ్ స్టార్ సునీల్ .. బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ (ఇండియా) ప్రై. లిమిటెడ్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 7న వరల్డ్వైడ్గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆడియోను నాలుగు పట్టణాల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఆల్బమ్లోని మొదటి పాటను సెప్టెంబర్ 21న హైదరాబాద్లో, రెండో పాటను 22న వైజాగ్లో, మూడో పాటను 23న రాజమండ్రిలో, నాలుగో పాటను సెప్టెంబర్ 24న విజయవాడలో రిలీజ్ చెయ్యబోతున్నాట్టు నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేశారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోంది. సునీల్ సరసన సుష్మారాజ్, రిచా పనయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ,నరేష్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, వెన్నెల కిషోర్, షకలక శంకర్, ప్రభాస్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







