తుర్కెమెనిస్థాన్‌ రాజధాని లో పక్షి ఆకారం విమానాశ్రయం

- September 17, 2016 , by Maagulf
తుర్కెమెనిస్థాన్‌ రాజధాని లో పక్షి ఆకారం విమానాశ్రయం

తుర్కెమెనిస్థాన్‌ రాజధాని అష్గబత్‌లో శనివారం పక్షి ఆకారంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తుర్కెమెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్బాంగ్లీ బెర్డోముఖామెడోవ్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో రెండు ప్యాసింజర్‌ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 17 మిలియన్ల మంది ప్రయాణించే సామర్థ్యం ఉండేలా దీన్ని నిర్మించారు. అంతేకాకుండా రెండు లక్షల టన్నుల సరుకును రవాణా చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఐదు అంతస్థుల ఈ విమానాశ్రయం పక్షి రెక్కలు విప్పుకున్నట్లు ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని నిర్మించేందుకు దాదాపు 2 బిలియన్ల డాలర్లు వ్యయమైనట్లు తుర్కెమెనిస్థాన్‌ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com