హజ్ యాత్రీకులకు ఘనస్వాగతం
- September 17, 2016
కువైట్: 700 మంది సెక్యూరిటీ సిబ్బంది, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని పలు ప్రాంతాల్లో హజ్ నుంచి తిరిగివస్తున్న యాత్రీకులకు సహాయపడేందుకు నియమించబడ్డారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) ఈ వివరాల్ని వెల్లడించింది. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ పెట్రోల్స్ ఇప్పటికే తమ కార్యకలాపాల్ని ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ల వద్ద, మల్టీ స్టోరీ పార్కింగ్ వద్ద మోహరించి, రౌండ్ ద క్లాక్ సేవలు అందించనుంది. మినిస్ట్రీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అలాగే మినిస్ట్రీ కస్టమ్స్ కౌంటర్స్ని పెంచి, రద్దీని తట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇంకో వైపున ఇ-బ్రాస్లెట్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయ్యిందనీ, దీని ద్వారా జిపిఎస్ సహాయంతో యాత్రీకులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, వారికి తగిన సహాయ సహకారాలు అందించగలిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్, అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ యూకుబ్ అల్ సనీయా ఇ-బ్రాస్లెట్ విధానం చాలా అద్భుతంగా పనిచేసినట్లు వివరించారు. ఇకపైన కూడా హజ్ యాత్రీకులకు ఈ విధానం ద్వారా సేవలందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







