ఖైదీలకు డ్రోన్ హెలికాఫ్టర్ ద్వారా మాధకద్రవ్యాల సరఫరా
- September 18, 2016
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకొంటుందో ఏమోగానీ...విద్రోహశక్తులు మాత్రం విన్నూత్న ప్రయోగాలు చేస్తూ..అధికారులకు మతులు పోగొడుతున్నారు.
సెంట్రల్ జైల్ వద్ద ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ జైలు హాల్ పై భాగంలో ఒక వింత ధ్వని వినడం జరిగింది. ఆ శబ్దం ఏమై ఉంటుందోనని ఆయన నిశితంగా పరిశీలన చేయగా ఒక రిమోట్ తో నియంత్రించే డ్రోన్ హెలికాఫ్టర్ చూడటం జరిగింది. దానితో విస్తు పోయిన ఆ అధికారి మరింత పరీక్షగా ఆ ఎగిరే బొమ్మలాంటి హెలికాఫ్టర్ అడుగు భాగంలో ఒక పెద్ద ప్యాకేజీ ఉందని గ్రహించారు. ఆ అధికారి ప్యాకేజీ తెరిచి చూడగా అనుమానిత తెల్లని రంగు గల పౌడర్ ఉన్న మూడు ప్లాస్టిక్ సంచులు దొరికేయి. వాటిని పరిశీలించి చూడగా అదో శక్తివంతమైన మత్తు కల్గించే మాదక ద్రవ్యంగా గుర్తించడం జరిగింది. జైలులో ఉన్న ఖైదీలలో కొందరకి ఈ తరహా సరఫరా ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా ఆయన గ్రహించి వెంటనే ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించారు. ఈ అక్రమ రవాణా పై ఒక కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







