సముద్ర కెరటాలతో గల్లంతైన ఒమాని బాలుని మృతదేహం లభ్యం
- September 18, 2016
మస్కట్ : గత బుధవారం నాడు సముద్రంలోనికి వెళ్ళి కెరటాల మధ్య తప్పిపోయిన ఓ 10 ఏళ్ల బాలుని మృతదేహంను శనివారం ఉదయం జలాన్ బాణీ బు ఆలీ సువైహ్ ప్రాంతంలో కనుగొన్నారు.
మూడు రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన బాలుని శవంను గుర్తించిన స్థానిక గ్రామవాసులు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి సమాచారం అందించారు. బాలుని ఆచూకీ కోసం సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి మరియు నివాసితులు ఆ బాలుని కోసం గత మూడు రోజులుగా అన్వేషణ చేస్తుంది.
ఆ బాలుని పేరు చెప్పేందుకు ఆసక్తి చూపని అధికారులు, బుధవారం జరిగిన దుర్ఘటన వివరాల తెలిపారు. మస్కట్ లోని క్కురుం జిల్లాలో ఒక బీచ్ వద్ద ఈతకు వెళ్ళినపుడు ఈ విషాదం జరిగింది. ఆ బాలునితో పాటు మరో ఇద్దరు పిల్లలు సైతం సముద్ర కెరటాలతో కొట్టుకుపోయారు. కానీ నివాసితులు వారిఇరువుర్ని రక్షించగలిగేరు..కానీ ఆ ఒక్క ఒమాన్ బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదాలు జరిగే ఆ ప్రాంతంలో ఈతకు వెళ్ళరాదని, కఠినమైన సముద్ర కెరటాలతో మునిపోతారని ఆ ప్రమదాన్ని నివారించేందుకు అధికారుల నుండి అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈత వెళ్ళి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గత సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయిన కేసులు 10 వరకు ఒమన్ లో నమోదైనప్పటకీ అధికారుల హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా పలువురు వ్యవహరిస్తున్నారు. సముద్రంలో శక్తివంతమైన ప్రవాహాల కారణంగా ఈతని శక్తివంతంగా కొట్టలేరని ముఖ్యంగా పిల్లలు మునిగిపోవడం తరచూ జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నిర్లక్ష్య ప్రవర్తన వ్యతిరేకంగా తల్లిదండ్రులు హెచ్చరించడానికి సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీకి అనేక ప్రచారాలు నిర్వహిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







