షార్జాలో మీటర్లని అక్రమంగా సవరించిన 12 మంది పాకిస్థాన్ డ్రైవర్ల పట్టివేత
- September 18, 2016
తాడిచెట్టు ఎందుకు ఎక్కువంటే ..దూడ గడ్డి కోసమని వెనుక ఎవరో టకీ మని సమాధానం చెప్పినట్లు...టాక్సీ మీటర్ల ట్యంపేరింగ్ ఎందుకు చేసేరని పాకిస్థాన్ డ్రైవర్ లను పోలీసులు ప్రశ్నిస్తుంటే, వారు వింత వింత కారణాలు చెబుతున్నారు.. షార్జా పోలీస్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగ ఉల్లంఘన ఆరోపణలపై 12 మంది టాక్సీ డ్రైవర్లు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ డ్రైవర్లు అందరూ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం విశేషం. వీరు తమ టాక్సీలలో ఉన్న మీటర్లను అక్రమంగా సవరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు షార్జా ఆర్.టి.ఎ వివరించింది.
ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాక్సీ డ్రైవర్లు మీటర్ ను కలిపే ఒక తీగని తొలగించి ఆ అక్రమ మీటర్ల దిద్దుబాటు ద్వారా 300,000 డి హెచ్ డబ్బుని దుర్వినియోగం చేసినట్లు షార్జా ఆర్.టి.ఎ ఒక కార్ఖానా లోనికి ఈ కార్లని తీసుకొని వాసిట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు ఒక నివేదిక సమర్పించింది. ఈ మధ్యకాలంలో ఆయా డ్రైవర్లకు చెందిన పాస్పోర్ట్ లను ముందస్తు జాగ్రత్త చర్యగా స్వాధీనం చేసుకొంది. పోలీసుల నేరవిచారణ సమయంలో పది మంది టాక్సీ డ్రైవర్లు తమ నేరం అంగీకరించాడు కానీ తాము ఎంత డబ్బు దుర్వినియోగపర్చేమో తెలియదని చెప్పారు. మిగిలిన మరో ఇద్దరు డ్రైవర్లు తమపై చేసిన ఆరోపణని ఖండించారు. తాను 24,000 డి హెచ్లను అపహరించినట్లు 24 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక డ్రైవర్ అంగీకరించాడు తాను , ఒకటి, తనకు నడుం నొప్పి బాధ ఉందని, తక్కువ ఆదాయం ఉండటంతో అందుకే అల్ ఐన్ వెళ్ళి వచ్చింది అన్నారు. అందుకే తగినంత ప్రయాణాలకు సిద్ధం కాలేదని తెలిపాడు. మరో డ్రైవర్, ఏ జెడ్ తన టాక్సీ మీటరు ఆగిపోయినట్లు అంగీకరించాడు. "నేను మీటర్ ని 22 సార్లు కంటే ఎక్కువ మార్లు ఆగిపోయిందని ఆ విధంగా కూడబెట్టిన డబ్బుతో ట్రాఫిక్ ఉల్లంఘనలని చెల్లించడానికి ఉపయోగించేవాడినని చెప్పారు. మరో డ్రైవర్ మాట్లాడుతూ తన టాక్సీని 29 సార్లు పైగా మీటర్ ఆపినట్లు ఆ డబ్బుని పెట్రోల్ చెల్లించడానికి ఉపయో గించినట్లు తెలిపాడు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









