షార్జాలో మీటర్లని అక్రమంగా సవరించిన 12 మంది పాకిస్థాన్ డ్రైవర్ల పట్టివేత
- September 18, 2016
తాడిచెట్టు ఎందుకు ఎక్కువంటే ..దూడ గడ్డి కోసమని వెనుక ఎవరో టకీ మని సమాధానం చెప్పినట్లు...టాక్సీ మీటర్ల ట్యంపేరింగ్ ఎందుకు చేసేరని పాకిస్థాన్ డ్రైవర్ లను పోలీసులు ప్రశ్నిస్తుంటే, వారు వింత వింత కారణాలు చెబుతున్నారు.. షార్జా పోలీస్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగ ఉల్లంఘన ఆరోపణలపై 12 మంది టాక్సీ డ్రైవర్లు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ డ్రైవర్లు అందరూ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం విశేషం. వీరు తమ టాక్సీలలో ఉన్న మీటర్లను అక్రమంగా సవరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు షార్జా ఆర్.టి.ఎ వివరించింది.
ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాక్సీ డ్రైవర్లు మీటర్ ను కలిపే ఒక తీగని తొలగించి ఆ అక్రమ మీటర్ల దిద్దుబాటు ద్వారా 300,000 డి హెచ్ డబ్బుని దుర్వినియోగం చేసినట్లు షార్జా ఆర్.టి.ఎ ఒక కార్ఖానా లోనికి ఈ కార్లని తీసుకొని వాసిట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు ఒక నివేదిక సమర్పించింది. ఈ మధ్యకాలంలో ఆయా డ్రైవర్లకు చెందిన పాస్పోర్ట్ లను ముందస్తు జాగ్రత్త చర్యగా స్వాధీనం చేసుకొంది. పోలీసుల నేరవిచారణ సమయంలో పది మంది టాక్సీ డ్రైవర్లు తమ నేరం అంగీకరించాడు కానీ తాము ఎంత డబ్బు దుర్వినియోగపర్చేమో తెలియదని చెప్పారు. మిగిలిన మరో ఇద్దరు డ్రైవర్లు తమపై చేసిన ఆరోపణని ఖండించారు. తాను 24,000 డి హెచ్లను అపహరించినట్లు 24 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక డ్రైవర్ అంగీకరించాడు తాను , ఒకటి, తనకు నడుం నొప్పి బాధ ఉందని, తక్కువ ఆదాయం ఉండటంతో అందుకే అల్ ఐన్ వెళ్ళి వచ్చింది అన్నారు. అందుకే తగినంత ప్రయాణాలకు సిద్ధం కాలేదని తెలిపాడు. మరో డ్రైవర్, ఏ జెడ్ తన టాక్సీ మీటరు ఆగిపోయినట్లు అంగీకరించాడు. "నేను మీటర్ ని 22 సార్లు కంటే ఎక్కువ మార్లు ఆగిపోయిందని ఆ విధంగా కూడబెట్టిన డబ్బుతో ట్రాఫిక్ ఉల్లంఘనలని చెల్లించడానికి ఉపయోగించేవాడినని చెప్పారు. మరో డ్రైవర్ మాట్లాడుతూ తన టాక్సీని 29 సార్లు పైగా మీటర్ ఆపినట్లు ఆ డబ్బుని పెట్రోల్ చెల్లించడానికి ఉపయో గించినట్లు తెలిపాడు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







