పారాలింపిక్స్‌ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి

- September 19, 2016 , by Maagulf
పారాలింపిక్స్‌ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి

: రియోలో జరిగిన పారాలింపిక్స్‌ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాకారులు చేసిన నృత్యాలు, మిరుమిట్లు గొలిపే లేజర్‌షోతో మారకానా స్టేడియం హోరెత్తిపోయింది. బాణాసంచా వెలుగుల మధ్య వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. అనంతరం పారాలింపిక్స్‌ పతాకాన్ని రియో ఆర్గనైజర్‌ కార్విన్‌ టోక్యో గవర్నర్‌ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల ప్రారంభానికి ముందు శనివారం మృతిచెందిన ఇరాన్‌ సైక్లిస్ట్‌ బాహ్మాన్‌ గొల్బార్నెజాద్‌కి నివాళులర్పించారు.2020లో పారాలింపిక్స్‌ జపాన్‌ రాజధాని టోక్యోలో నిర్వహించనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com