రైడ్ హెయిలింగ్ యాప్స్పై కొత్త రెగ్యులేషన్స్
- September 19, 2016
అబుదాబీ: ఉబెర్, కరీమ్ వంటి సంస్థలు నిర్వహిస్తోన్న రైడ్ హెయిలింగ్ యాప్స్పై కొత్త రెగ్యులేషన్స్ త్వరలో అమల్లోకి రానున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఉబెర్, అలాగే దేశంలో ఉబెర్కి గట్టి పోటీ ఇస్తున్న కరీమ్ సంస్థలు యాప్ ద్వారా వినియోగదారులకు పెయిడ్ ట్యాక్సీ సర్వీసుల్ని అందిస్తున్నాయి. అయితే ఈ సేవల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే కోణంలో అధికారులు చర్యలు చేపట్టారు. దాంతో ఉబెర్, కరీమ్ సంస్థలు యాప్ సర్వీసుల్ని నిలిపివేశాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత యాప్ సర్వీసుల్ని కొనసాగిస్తామని ఆయా సంస్థలు వెల్లడించాయి. అయితే, అధికారులు ఆరోపిస్తున్నట్లుగా ఎలాంటి అక్రమాలకూ తాము చోటివ్వడంలేదని ఈ సంస్థలు చెబుతుండడం జరుగుతోంది. రైడ్ హెయిలింగ్ యాప్స్, సెంటర్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బై హైర్ కార్స్ (ట్రాన్సాద్)లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనీ, త్వరలోనే నిబంధనలు ఖరారవుతాయని జనరల్ మేనేజర్ మొహమ్మద్ దార్విష్ అల్ కామ్జి చెప్పారు. ట్రాన్సాద్ ఏడు ఫ్రాంచైజీ ట్యాక్సీ కంపెనీలతో పనిచేస్తోంది. 7,645 రిజిస్టర్డ్ ట్యాక్సీలు అబుదాబీలో పనిచేస్తున్నాయి. 2013లో ఉబెర్ తమ సర్వీసుల్ని అబుదాబీలో ప్రారంభించింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









