అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం..

- September 20, 2016 , by Maagulf
అమృత్‌సర్‌లో ఘోర ప్రమాదం..

 పంజాబ్‌ రాజధాని అమృత్‌సర్‌లోని అట్టారి సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది.50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు అట్టారి సమీపంలో అదుపుతప్పి ముహావా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతిచెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పిల్లలు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ప్రమాదవార్త విని షాక్‌ గురయ్యారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com