ఫలించిన భారత్ ప్రయత్నాలు
- September 20, 2016
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అజిత్ కుమార్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, మరోపక్క ఉగ్ర మూకలను భారత్ లోకి అక్రమంగా జొప్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రసంగాలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో బహిరంగంగానే ర్యాలీలు నిర్వహించడం ప్రపంచం చూస్తోందన్నారు. కాగా, అగ్ర దేశాలు, ఇతర మిత్ర దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే భారత రాయబారి ఈ స్థాయిలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









