ఫలించిన భారత్ ప్రయత్నాలు
- September 20, 2016
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అజిత్ కుమార్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, మరోపక్క ఉగ్ర మూకలను భారత్ లోకి అక్రమంగా జొప్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రసంగాలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో బహిరంగంగానే ర్యాలీలు నిర్వహించడం ప్రపంచం చూస్తోందన్నారు. కాగా, అగ్ర దేశాలు, ఇతర మిత్ర దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే భారత రాయబారి ఈ స్థాయిలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









