ఫలించిన భారత్ ప్రయత్నాలు
- September 20, 2016
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అజిత్ కుమార్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, మరోపక్క ఉగ్ర మూకలను భారత్ లోకి అక్రమంగా జొప్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రసంగాలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో బహిరంగంగానే ర్యాలీలు నిర్వహించడం ప్రపంచం చూస్తోందన్నారు. కాగా, అగ్ర దేశాలు, ఇతర మిత్ర దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే భారత రాయబారి ఈ స్థాయిలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







