ఫలించిన భారత్ ప్రయత్నాలు

- September 20, 2016 , by Maagulf
ఫలించిన భారత్ ప్రయత్నాలు

అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అజిత్ కుమార్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఒకపక్క కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ, మరోపక్క ఉగ్ర మూకలను భారత్ లోకి అక్రమంగా జొప్పిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న ప్రసంగాలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రపంచ దేశాలు ఎంత మొత్తుకున్నా పాకిస్తాన్ స్వదేశంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో బహిరంగంగానే ర్యాలీలు నిర్వహించడం ప్రపంచం చూస్తోందన్నారు. కాగా, అగ్ర దేశాలు, ఇతర మిత్ర దేశాల నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తర్వాతే భారత రాయబారి ఈ స్థాయిలో స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com