రాస్ తానురాలో అగ్ని ప్రమాదం 8 మంది కార్మికులకు గాయాలు

- September 20, 2016 , by Maagulf
రాస్ తానురాలో అగ్ని ప్రమాదం 8 మంది కార్మికులకు గాయాలు

జెడ్డా : సౌదీ అరంకో చమురు టెర్మినల్ ఫెసిలిటీ రాస్ తానురా లో  మంగళవారం ఉదయం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపదినట్లు సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలోతెలిపింది. ఉదయం 9 గంటల సమయంలో అగ్నిఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడున్నవారిని  బలవంతంగా తరలించడం జరిగింది.తీవ్రమైన నష్టం కలిగించక ముందే అగ్నిమాపకదళం అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందించి అగ్నిని అదుపు చేశారు.

అరంకో చమురు ఉద్యోగులు మరియు ఆరుగురు కాంట్రాక్టర్లు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. వీరందరూ వైద్య చికిత్స పొందారని తెలిపారు. ఈ స్వల్ప అగ్ని సంఘటన కారణంగా చమురు మరియు వాయువు కార్యకలాపాలని  ప్రభావితం చేయ లేదని  అరంకో ప్రతినిధి అన్నారు. రాస్ తానురా టెర్మినల్ రోజుకు 550,000 బ్యారళ్ల ముడి చమురుని  శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ  అగ్నిప్రమాదానికి కారణం ఇంకా ఏమీ తెలియ రాలేదని కారణం కనుగోవడానికి ఒక పరిపూర్ణమైన దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com