రాస్ తానురాలో అగ్ని ప్రమాదం 8 మంది కార్మికులకు గాయాలు
- September 20, 2016
జెడ్డా : సౌదీ అరంకో చమురు టెర్మినల్ ఫెసిలిటీ రాస్ తానురా లో మంగళవారం ఉదయం జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపదినట్లు సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలోతెలిపింది. ఉదయం 9 గంటల సమయంలో అగ్నిఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడున్నవారిని బలవంతంగా తరలించడం జరిగింది.తీవ్రమైన నష్టం కలిగించక ముందే అగ్నిమాపకదళం అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందించి అగ్నిని అదుపు చేశారు.
అరంకో చమురు ఉద్యోగులు మరియు ఆరుగురు కాంట్రాక్టర్లు ఈ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. వీరందరూ వైద్య చికిత్స పొందారని తెలిపారు. ఈ స్వల్ప అగ్ని సంఘటన కారణంగా చమురు మరియు వాయువు కార్యకలాపాలని ప్రభావితం చేయ లేదని అరంకో ప్రతినిధి అన్నారు. రాస్ తానురా టెర్మినల్ రోజుకు 550,000 బ్యారళ్ల ముడి చమురుని శుద్ధి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా ఏమీ తెలియ రాలేదని కారణం కనుగోవడానికి ఒక పరిపూర్ణమైన దర్యాప్తు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







