వలసదారుడి ఇంట్లో భారీ చోరీ
- September 20, 2016
మనామా: ఓ వలసదారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు, ఇంట్లోకి ప్రవేశించి విలువైన బంగారు నగల్ని దోచుకున్నారు. అయితే ఈ దోపిడీ క్షణాల్లో జరిగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యోగేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నాడు ఆ ఇంట్లో. పది నిమిషాల సమయంలోనే ఈ దోపిడీ జరిగిపోయినట్లు యోగేష్ వివరించారు. తన భార్య పది నిమిషాల పాటు వేరే పని మీద బయటకు వెళ్ళడంతో, దొంగలు ఇదే సరైన సమయమని భావించి, ఆ సమయంలో దోపిడీకి పాల్పడినట్లు యోగేష్ పోలీసులకు తెలిపాడు. ఎప్పటినుంచో తన భార్య కదలికల్ని, ఇంటి పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించినవారే దోపిడీ చేసి ఉంటారని యోగేష్ అనుమానం వ్యక్తం చేశారు. కిచెన్ రూమ్లోని విండో ద్వారా దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అపార్ట్మెంట్లోకి చొరబడేందుకు భారీ నిచ్చెన అవసరం అవుతుందని, దొంగలు వచ్చి వెల్ళిన తీరు విస్మయం కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పోలీసులు అపార్ట్మెంట్ వాసుల్ని అడిగి దొంగతనం జరిగిన తీరుని తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







