మట్టి చరియలు విరిగిపడి 10 మంది మృతి..
- September 20, 2016
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్ లో తాజాగా భారీ వర్షాలు, వరదలు కారణంగా 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారని విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. గౌర్టు జిల్లాలో భారీ వర్షాలతో రెండు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వందలాది మందిని ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మిలటరీ స్టేషన్స్ కి తరలించి ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.భారీగా మట్టి చరియలు రెండు ఇళ్లపై విరిగిపడ్డాయి. దీంతో అందులో నివసిస్తున్న ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు గల్లంతయ్యారని తెలిపారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ సహాయక చర్యల్లో సైనికులు, పోలీసులు పాల్గొన్నారని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









