మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు
- September 21, 2016
మహిళా ఉద్యోగుల భద్రతలో తెలంగాణ రాష్ట్రానికి రెండో ర్యాంకు లభించింది. అలాగే ఉద్యోగాలు చేసే మహిళలకు ఢిల్లీ నగరం పరమ వేస్ట్ అని, ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని తేలింది. అలాగే రెండోస్థానంలో తెలంగాణ నిలవగా, ఆంధ్రప్రదేశ్కు ఆరోస్థానం లభించింది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్), నాథన్ అసోసియేట్స్ సంస్థలు సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు పలు ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఆయా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిల భద్రతకు తగు ఏర్పాట్లు చేసింది. షీ టీమ్స్ ఏర్పాటుచేయడమేగాక మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటుచేసింది. తెలంగాణలో ఏర్పాటుచేసిన షీ టీంల వ్యవస్థపై ఆయా రాష్ట్రాలు కూడా ఆస్తక్తి చూపి అధ్యయనం కోసం హైదరాబాద్కు కూడా వచ్చాయి.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







