పాక్ను ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా అమెరికాలో బిల్లు
- September 21, 2016
పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్ను ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశంగా నిర్దేశిస్తూ అమెరికాలోని ఇద్దరు కీలక చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, డెమోక్రాట్, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడైన డానా రోహ్రబచర్ సంయుక్తంగా హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు. అమెరికాను వంచించిన పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.
బిన్ లాడెన్ వంటి ప్రమాదకార టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదనికి పాకిస్థాన్ కొమ్ముకాస్తోందనడానికి నిదర్శమని టెడ్ పో అన్నారు.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోందా లేదా అన్నదానిపై అధ్యక్షుడు ఒబామా పాలక వర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, ఆ తర్వాత 30 రోజుల్లో కార్యదర్శి జాన్ కెర్రీ దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. మరో కాంగ్రెస్ సభ్యుడు పీట్ ఓల్సన్ ఉరీ ఘటనను ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు కొమ్ముకాస్తున్న వారిని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రతి చర్యకు తాను మద్దతిస్తానని ఆయన అన్నారు. మరో సభ్యుడు జాన్ కార్నిన్ కూడా పాక్కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







