మోదీ రోజంతా వార్ రూమ్లో ...
- September 21, 2016
ఉరీ దాడి నేపథ్యంలో.. పాక్తో 'కంటికి కన్ను పంటికి పన్ను' తరహాలో వ్యవహరించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ప్రధాని మోదీ బుధవారం రోజంతా వార్ రూమ్ (ఆర్మీ తాలూకూ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్)లో అత్యున్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. వార్రూమ్గా వ్యవహరించే ఈ అత్యంత రహస్యమైన కార్యాలయం నుంచే రక్షణ శాఖ అన్ని భద్రతాపరమైన అంశాలనూ పర్యవేక్షిస్తుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా.. ఆ రూమ్లోనే ఉన్న పీఎం బుధవారం నాడూ భద్రత వ్యవహారాలపై కేబినెట్ కమిటీతో అక్కడే రెండుసార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.ఉరీ దాడికి ఎలా స్పందించాలో కేంద్ర కేబినెట్లోని కీలక మంత్రులతో, ఆర్మీ చీఫ్తో కార్యాచరణపై చర్చించారు. మ్యాప్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సైకత నమూనాల ఆధారంగా మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఆయనకు పలు వివరాలు తెలియజేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









