ఓ రైలులో సాగే ప్రేమకథ 'రైల్‌'

- September 21, 2016 , by Maagulf
ఓ రైలులో సాగే ప్రేమకథ  'రైల్‌'

ప్రభుసాలమన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా నటించిన చిత్రం 'తొడరి'. కీర్తిసురేష్‌ కథానాయిక. తెలుగులో 'రైల్‌' పేరిట రూపుదిద్దుకుంది. రెండు భాషల్లోనూ గురువారం తెరపైకి రానుంది. సాధారణంగా ప్రభుసాలమన్‌ సినిమా అంటేనే.. అందమైన ప్రేమకథ.. దాన్ని తలదన్నే ప్రకృతి సోగయం ఉట్టిపడుతుంది. 'మైనా', 'గుమ్కి' చిత్రాలు అలాంటి పేరునే సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'తొడరి' కూడా అలాంటి సినిమాగానే ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓ రైలులో సాగే ప్రేమకథతో దీన్ని రూపొందించారు ప్రభుసాలమన్‌. ఇమాన్‌ సంగీతం సమకూర్చారు. తమిళనాడులో 400 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందని సమాచారం.ఈ సినిమా కోసం ధనుష్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com