గోల్డ్ గ్యాంగ్ ఆటకట్టు
- September 21, 2016
మస్కట్: గత నెలలో ముట్రా గోల్డ్ సౌక్లోని జ్యుయెలరీ స్టోర్లో జరిగిన భారీ దొంగతనం అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ గ్యాంగ్ భారీ మొత్తంలో గోల్డ్ని దోచుకుని, దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో, రాయల్ ఒమన్ పోలీసులు పకడ్బందీ వ్యూహం రచించారు. మొత్తం అన్ని రవాణా మార్గాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 37 కిలోల బంగారంతో నిందితులు దేశం నుంచి బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటిదాకా ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు ఇంటర్పోల్ని ఆశ్రయించడం జరిగింది. గ్యాంగ్లో అందరూ ఆసియాకి చెందిన వ్యక్తులుగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు విమానాశ్రయం ద్వారా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, వారిని ట్రాక్ చేసిన పోలీసులు చాకచక్యంగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంకో వైపున సముద్ర మార్గంగా పారిపోయేందుకు ప్రయత్నించినవారినీ పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







