అబుదాబీలో 188 కార్ల స్వాధీనం
- September 21, 2016
అబుదాబీ: అబుదాబీలో అధికారులు 188 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ లాట్స్లో నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ వాహనాల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇప్పటికే 175 వార్నింగ్స్ కూడా వాహన యజమానులకు పంపించారు. గత నెలలో ప్రారంభించిన క్యాంపెయిన్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా వాహనాల్ని వదిలివేయరాదనీ, అలా వదిలేస్తే దుమ్ముపట్టిన వాహనాలతో నగరం అపరిశుభ్రంగా కనిపిస్తుందని గత కొన్నాళ్ళుగా వాహనదారుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. అయితే కొందరు అధికారుల సూచనల్ని, హెచ్చరికల్ని లెక్క చేయని కారణంగా ఆయా వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వార్నింగ్ లెటర్స్ పంపిన తర్వాత మూడు రోజుల్లోగా సంబంధిత వాహనాల యజమానులు స్పందించకపోతే, ఆ వాహనాలు టౌల్ చేయబడతాయి. అల్ వత్బా ఇంపౌండింగ్ యార్డ్కి ఆ వాహనాల్ని తరలించి, చట్ట పరమైన చర్యల్ని వాహనదారులపై తీసుకోవం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







