రాంగ్ బటన్ కారణంగా మనీల విమానాశ్రయంలో గందరగోళం
- September 24, 2016
రియాద్: అసలే బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్న విమానాశ్రయ సిబ్బంది తమ పరిధిలో ఉన్న ఓ విమానం హైజాక్ కాబడిందని ఒక అలారం రెండుసార్లు కుయ్యో కుయ్యోమంటూ....మోగడంతో సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. గత మంగళవారం నాడు మనీల విమానాశ్రయం వద్ద జరిగిన ఈ సంఘటన గూర్చిన వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోనికి వస్తున్నాయి. పైలట్ పొరబాటున నొక్కిన బటన్ కారణంగా మనీల విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ (సౌదీ) విమానంలో పైలట్ నొక్కిన బటన్ ఘటన నేపథ్యంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పలు విమానాల రాకపోకలు వాయిదా పడటం..ప్రయాణ వేళలు మారిపోయి ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం దుండుగులు హైజాక్ చేసేరని తెలిపే బటన్ పైలట్ పొరబాటున రెండుసార్లు నొక్కడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడిక్కి పోయంది. ఫిలిప్పీన్ మీడియా నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం, మనీలా లో పౌర విమానయాన అధికారులు సంఘటన వెనుక నిజమైన కారణాల పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







