పీఎస్ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం..
- September 25, 2016
భూ ఉపరితలంపై వాతావరణం పరిశీలన, తుపాన్లను ముందుగానే పసిగట్టే పరిజ్ఞానంతో రూపొందిన స్కాట్శాట్ ఉపగ్రహం పీఎస్ఎల్వీ-సీ35 నాలుగో దశ రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో నిర్ణయించిన సమయానికి అనుగుణంగానే రాకెట్ ప్రయోగం జరిగింది. స్కాట్శాట్-1ను పీఎస్ఎల్వీ-సీ35 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంలో 3 స్వదేశీ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి తీసుకెళ్లింది.వాటిని సంబంధిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ జరుగుతోంది. ముంబై ఐఐటీకి చెందిన ప్రథమ్ ఉపగ్రహం, బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహం, అల్జీరియాకు చెందిన మూడు ఉపగ్రహాలు, కెనడా, యూఎస్కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఈ రాకెట్ ద్వారా నింగిలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం ప్రారంభించిన 2.15 గంటల్లో ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







