బహ్రెయిన్ నకిలీ బంగారం కేసు వాయిదా
- August 11, 2015
నకిలీ బంగారు ఆభరణాల విక్రయం కేసులో నిందితుడైన 31 సంవత్సరాల పాకిస్తానీ వ్యక్తిని బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చిన నేపధ్యంలో, ప్రాసిక్యూషన్ వారికి సాక్ష్యాధారాల సేకరణకుగాను సమయమిస్తూ ఈ కేసు అక్టోబర్ 26 కు వాయిదా పడింది. సంబంధిత నిందితుడు, గత సంవత్సరం సెప్టెంబర్ 12 న రీఫ్ఫాలోని వెజాల్ జువెల్లర్స్ లో 13 బంగారు బ్రాసెలెట్లను కొత్తబంగారం కోసం మార్పిడిచేయబోగా, వాటిపై హాల్మార్క్ ఉన్నప్పటికీ, అవి 22 కారట్లవి కావని కనుగొన్న సంగతి విదితమే. నకిలీ పాస్పోర్టును కూడా కొనుగోలుచేయబోయిన ఈ వ్యక్తి, అవి నకిలీవని తనకు తెలియదని బుకాయిస్తుండగా, పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి హల్మార్కింగ్ మరియు ఇన్స్పెక్షన్ యూనిట్ వారు 112.9 గ్రాముల బరువుగల ఈ బ్రాసెలేట్లు 22 కార ట్ కావని స్పష్టం చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









