బహ్రెయిన్ నకిలీ బంగారం కేసు వాయిదా
- August 11, 2015
నకిలీ బంగారు ఆభరణాల విక్రయం కేసులో నిందితుడైన 31 సంవత్సరాల పాకిస్తానీ వ్యక్తిని బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చిన నేపధ్యంలో, ప్రాసిక్యూషన్ వారికి సాక్ష్యాధారాల సేకరణకుగాను సమయమిస్తూ ఈ కేసు అక్టోబర్ 26 కు వాయిదా పడింది. సంబంధిత నిందితుడు, గత సంవత్సరం సెప్టెంబర్ 12 న రీఫ్ఫాలోని వెజాల్ జువెల్లర్స్ లో 13 బంగారు బ్రాసెలెట్లను కొత్తబంగారం కోసం మార్పిడిచేయబోగా, వాటిపై హాల్మార్క్ ఉన్నప్పటికీ, అవి 22 కారట్లవి కావని కనుగొన్న సంగతి విదితమే. నకిలీ పాస్పోర్టును కూడా కొనుగోలుచేయబోయిన ఈ వ్యక్తి, అవి నకిలీవని తనకు తెలియదని బుకాయిస్తుండగా, పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి హల్మార్కింగ్ మరియు ఇన్స్పెక్షన్ యూనిట్ వారు 112.9 గ్రాముల బరువుగల ఈ బ్రాసెలేట్లు 22 కార ట్ కావని స్పష్టం చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









