బహ్రెయిన్ నకిలీ బంగారం కేసు వాయిదా
- August 11, 2015
నకిలీ బంగారు ఆభరణాల విక్రయం కేసులో నిందితుడైన 31 సంవత్సరాల పాకిస్తానీ వ్యక్తిని బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చిన నేపధ్యంలో, ప్రాసిక్యూషన్ వారికి సాక్ష్యాధారాల సేకరణకుగాను సమయమిస్తూ ఈ కేసు అక్టోబర్ 26 కు వాయిదా పడింది. సంబంధిత నిందితుడు, గత సంవత్సరం సెప్టెంబర్ 12 న రీఫ్ఫాలోని వెజాల్ జువెల్లర్స్ లో 13 బంగారు బ్రాసెలెట్లను కొత్తబంగారం కోసం మార్పిడిచేయబోగా, వాటిపై హాల్మార్క్ ఉన్నప్పటికీ, అవి 22 కారట్లవి కావని కనుగొన్న సంగతి విదితమే. నకిలీ పాస్పోర్టును కూడా కొనుగోలుచేయబోయిన ఈ వ్యక్తి, అవి నకిలీవని తనకు తెలియదని బుకాయిస్తుండగా, పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి హల్మార్కింగ్ మరియు ఇన్స్పెక్షన్ యూనిట్ వారు 112.9 గ్రాముల బరువుగల ఈ బ్రాసెలేట్లు 22 కార ట్ కావని స్పష్టం చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







