ఖతార్ లో భారతీయ మత్స్యకారుని కాల్చివేత

- August 11, 2015 , by Maagulf
ఖతార్ లో భారతీయ మత్స్యకారుని కాల్చివేత

భారత్ లోని తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి చెందిన అనీష్ అనే  మరో యువకుడు కాల్చివేతకు బలయ్యాడు. అతని మృతదేహాన్ని బహ్రైన్ నావికాదళాలు ఆసుపత్రికి తీసుకురాగా, బోటులోని ఇతర మత్స్యకారులు, బోటుతో సహా  సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాబడ్డారు. సంఘటన వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ, తమిళనాడు మత్స్యకారుల అభివృద్ధి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడైన పి. జస్టిన్ అంటోనీ కధనం ప్రకారం, కాటారీ స్పాన్సర్ కు చెందిన ఒక బొటులో ఇతరులతో కలసి వేటకు వెళ్ళిన అనీష్, సముద్రపు దొంగల కాల్పులకు గురై ఉండవచ్చనీ ఆరోపించారు. అనీష్ మృతదేహాన్ని స్వదేశానికి వీలైనంత త్వరగా పంపాలని, సముద్రపు దొంగలను అరికట్టడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com