సానియా మీర్జా డబుల్స్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది..
- September 26, 2016
భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీఏ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 9730 పాయింట్లతో సానియా ప్రథమ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్కు చెందిన మార్టినా హింగిస్ రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరి మధ్య కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇటీవల చెక్ భామ స్ట్రికోవాతో జోడీ కట్టిన సానియా తాజాగా టోరో పాన్ పసిఫిక్ ఓపెన్ను గెలుచుకుంది. ఈ జోడీకి ఇది రెండో టైటిల్.భారత ఆటగాడు సాకేత్ మైనేని తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు చేరుకోగలిగాడు. సింగిల్స్ విభాగంలో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన మైనేని 138వ స్థానంలో నిలిచాడు.మరో ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ 229, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో నిలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న 18వ స్థానంలో లియాండర్ పేస్ 60వ స్థానంలో కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







