అక్రమ భవనాలు, కట్టడాలను కూల్చేయండి ...కేటీఆర్
- September 26, 2016
రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ భవనాలు, కట్టడాలను కూల్చి వేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. ఇటీవలి వర్షాలు, వరదల పరిస్థితులను ఆయన సోమవారం సమీక్షించారు.
సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన ్స ద్వారా మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. పలు పట్టణాలను వరదనీరు ముంచెత్తడానికి దారి తీసిన కారణాలు గుర్తించాలని నిర్దేశించారు. అన్ని చెరువులు, నాలాల మ్యాప్ సేకరించి, వాటిపై అక్రమ కట్టడాలు గుర్తించాలని కోరారు. నాలాలను కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టవద్దని, అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని ఆదేశించారు. కూల్చివేతల్లో పేదలను కాకుండా, వాణిజ్య అవసరాల కోసం జరిగిన నిర్మాణాలను టార్గెట్ చేయాలని ఆదేశించారు. కుదించుకుపోయిన నాలాలను వెడల్పు చేయాలని, ఇందుకోసం రెవెన్యూ, సాగునీటి శాఖల అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు గుర్తించి కూల్చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగ కుండా చూడాలన్నారు. ఎక్కడైనా అలా ప్రాణన ష్టం జరిగితే కమిషన ర్ను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని కొందరు కమిషనర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే వారం రోజుల్లో చర్య తీసుకుంటామని, ఇదే చివరి అవకాశమని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించక పోయినా, బాధ్యతల నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినా విధుల నుంచి తొలగించడం ఖాయమని స్పష్టం చేశారు. అలాంటి వారి జాబితా సిద్ధం చేయాలని మున్సిపల్ డైరెక్టర్ను కేటీఆర్ ఆదేశించారు. ఇకపై వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, ఇందుకోసం మున్సిపాలిటీలలో వారం రోజుల్లో ఆ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ధ్వంసమైన రహదారులు, ఇతర మౌలిక వసతులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం జలమండలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం బోర్డు అధికారులతో సమీక్ష జరిపారు. సీవరేజి పైపులైన్ల పరిస్థితి, వాటర్ మీటర్ల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. పైపులైన్ల లీకేజీలు గుర్తించేందుకు సెన్సార్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరారు. సీవరేజ్ పైప్లైన్ల పటిష్ఠతను కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించాలని మంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







