దుబాయ్ లో మతం పేరుతో కూతురిని సముద్రానికి బలి చేసిన తండ్రి
- August 11, 2015
సంప్రదాయం, మతం పేరుతే తండ్రే కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న సంఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. దుబాయ్ పోలీసు సెర్చ్ అండ్ రెస్క్యూ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అక్కడి స్ధానిక మీడియా ఛానెల్తో చెప్పిన దాని ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా దీనిని అభివర్ణించాడు. పిక్నిక్లో భాగంగా ఆసియాకు చెందిన ఓ కుటుంబం దుబాయ్లోని బీచ్కి వ్యాహ్యాళికి వచ్చారు. తండ్రితో పాటు పిల్లలు సముద్రం లో ఈత కొట్టేందుకు దిగారు. ఇలా సరదాగా ఈత కొడుతున్న సమయంలో అలల తాకిడికి తన 20 ఏళ్ల కుమార్తె లోపలికి కొట్టుకుపోయింది. దీనిని గమనించిన బే గార్డ్స్ (రక్షక సిబ్బంది) పరుగున వచ్చి వారిని రక్షించబోయారు. రక్షించేందుకు వస్తున్న ఇద్దరూ పురుషులే అని గమనించిన తండ్రి తన కూతురిని కాపాడొద్దని, సముద్రంలో మునిగిపోవాలని సూచించాడు. దీంతో ఆ యువతి నీళ్లలో మునిగి మరణించింది. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకలా చేశావంటూ ప్రశ్నంచారు. యవ్వనంలో ఉన్న తన కుమార్తెను ఎవరైనా పరాయి పురుషుడు తాకితే తమ మతం కఠినంగా శిక్షిస్తుందని, ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని సమాధానమిచ్చాడు. అంతకంటే తమ కుమార్తె చనిపోవడమే మేలు అని భావించి అలా చెప్పానని ఆమె తండ్రి చెప్పాడు. సంప్రదాయం, మతం పేరుతో కన్న కూతురే ఓ తండ్రి నిర్ణయానికి బలైందని డిప్యూటీ డైరెక్టర్ లెప్ట్నెంట్ కల్నల్ బురిఖ్ మీడియాతో తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు









