'ప్రతిక్షణం'. చిత్రం ఆడియో వేడుక ఘనంగా.......
- September 27, 2016
మనీష్, తేజస్విని నాయకానాయికలుగా నాగేంద్రప్రసాద్ (శ్రీనాగ్) దర్శకత్వంలో భాగ్యలక్ష్మి మూవీమేకర్స్ పతాకంపై జి.మల్లికార్జునరెడ్డి నిర్మించిన చిత్రం 'ప్రతిక్షణం'. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆడియో సీడీలను అతిథిగా విచ్చేసిన ఆర్.పి.పట్నాయక్ విడుదలచేసి, తొలి సీడీని అతిథిగా పాల్గొన్న శాసనసభ్యుడు గువ్వల బాలరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు బాలరాజు మాట్లాడుతూ, "చిత్రబృందానికి అంతటికీ అభినందనలు. వీరంతా సమష్టికృషితో చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి" అని ఆకాంక్షించారు. ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ, "ఈ చిత్ర సంగీత దర్శకుడు రఘురామ్ గాయకుడిగా ఉన్నప్పట్నుంచీ నాకు పరిచయం ఉంది.అతను చేసిన ఈ చిత్రం పాటలు చాలా బావున్నాయి. అలాగే ట్రైలర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో హీరోహీరోయిన్లకు మంచి బ్రేక్ దొరుకుతుందని భావిస్తున్నా" అని అన్నారు. హీరో మనీష్ మాట్లాడుతూ, "నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. చిత్రం మేమంతా అనుకున్నట్లుగానే చాలాబాగా వచ్చింది. పాటలన్నీ బావున్నాయని అందరూ అంటున్నారు" అని పేర్కొనగా, హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ, "నా కెరీర్లో చాలా మంచి చిత్రాన్ని అందించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. పాటలతో పాటు సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందన్న నమ్మకం ఉంది" అని అన్నారు.నిర్మాత మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ, "పారిశ్రామికవేత్తగా ఉన్న నేను తొలిసారిగా ఈ రంగంలోకి వచ్చేముందు ఎంతోమంది సన్నిహితులు వారించారు. అయితే దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి, ఈ చిత్రం చేశాను. హారర్ సినిమానే కానీ దెయ్యం ఉండదు. ప్రతిక్షణం ఆసక్తికరంగా ఉంటుంది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. దర్శకుడు నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ, "కమర్షియల్ అంశాలుంటే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి ట్విస్ట్లుంటాయి. ప్రతీ సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. చిత్రబృందమంతా సహకరించడం వల్లే ఓ చక్కటి సినిమాను తీయగలిగాను" అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నవీన్యాదవ్, కె.ఎల్.దామోదర్ప్రసాద్, మల్టీడైన్షన్ వాసు, సాయివెంకట్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివకుమార్, మదన్, సురేష్వర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







