మూడు రోజుల వీకెండ్ ప్రకటన
- September 27, 2016
యూఏఈ: యూఏఈ అక్టోబర్ 2వ తేదీని పబ్లిక్ మరియు, ప్రైవేట్ సెక్టార్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఇస్లామిక్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సెలవును డిక్లేర్ చేశారు. ఆదివారం 1438 హిజ్రి కారణంగా ఫెడరల్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్స్ మూసివేయబడతాయి. దాంతో అధికారికంగా పని దినాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, ఛైర్మన్ ఆఫ్ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ డాక్టర్ అబ్దుల్ రహమాన్ ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ కూడా ఆదివారం అక్టోబర్ 2వ తేదీని అధికారిక చెల్లింపు సెలవు దినంగా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకోసం ప్రకటించింది. మినిస్టర్ సక్ర్ ఘోబాష్, ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ కారణంగా యూఏఈ రెసిడెంట్స్కి మూడు రోజుల వీకెండ్ వచ్చినట్లయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







