హైదరాబాదులో వెలుగుచూసిన ఐఎస్ శిక్షణా సంస్థ
- September 29, 2016
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కదలికలు తాజాగా నగరంలో వెలుగుచూడటం విస్మయ పరుస్తోంది. ప్రముఖ మైనారిటీ విద్యాసంస్థ అయిన ఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఐసిస్ శిక్షణ కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలక్పేట్లోని ఈ ఇన్స్టిట్యూట్లో మైనారిటీ విద్యార్థులకు ఐసిస్ శిక్షణ ఇస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఫేస్బుక్ పేజీలో 'సేవ్ కంట్రీ' పేరిట పోస్టులు పెట్టారు. తనకు ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉందని, తనను గత ఏడాది చంపేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రయత్నించారని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఐసిస్ శిక్షణ కేంద్రం హైదరాబాద్లో కొనసాగుతున్నదని, ఈ విషయంలో ఎంఎస్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఫేస్బుక్లో తెలిపారు. తాను ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నానని, మొత్తం కమ్యూనిటీ గురించి కాదని అన్నారు. భారత్ మతాకీ జై, సేవ్ ఇండియా అంటూ పోస్టులు చేశారు. లెక్చరర్ ప్రవీణ్కుమార్ మృతి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







