గౌతమ్ కు పాక్ సమన్లు

- September 29, 2016 , by Maagulf
గౌతమ్ కు పాక్ సమన్లు

పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్‌ గౌతమ్‌ బంబావలేకు పాకిస్థాన్‌ సమన్లు జారీ చేసింది. పాక్‌ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ లక్షిత దాడులు చేసిన నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఆయనకు సమన్లు పంపింది. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనపై ఇటీవల భారత్‌లోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌కు భారత విదేశాంగ శాఖ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉరీ ఘటనలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్‌ నుంచి వచ్చారనే ఆధారాలను బాసిత్‌కు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com