పాక్ నటీనటులకు నిషేధం విధించిన ఐఎంపిపిఏ
- September 29, 2016
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సినీ రంగానికి తాకాయి. పాక్ నటులు, టెక్నీషియన్లపై నిషేధం విధిస్తున్న ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ ఆసోసియేషన్(ఐఎంపీపీఏ) తాజాగా ప్రకటన చేసింది. భారత్-పాక్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న పాక్ నటీనటులందరూ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటీవలే శివసేన పార్టీ హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఫవాద్ ఖాన్ గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ వెళ్లిపోయాడు. పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం లక్షిత దాడులకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







