పాక్ నటీనటులకు నిషేధం విధించిన ఐఎంపిపిఏ

- September 29, 2016 , by Maagulf
పాక్ నటీనటులకు నిషేధం విధించిన ఐఎంపిపిఏ

భారత్‌-పాక్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సినీ రంగానికి తాకాయి. పాక్‌ నటులు, టెక్నీషియన్లపై నిషేధం విధిస్తున్న ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆసోసియేషన్‌(ఐఎంపీపీఏ) తాజాగా ప్రకటన చేసింది. భారత్‌-పాక్‌ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి సందర్భంగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాక్‌ నటీనటులందరూ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటీవలే శివసేన పార్టీ హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ఫవాద్‌ ఖాన్‌ గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్‌ వెళ్లిపోయాడు. పాక్‌ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం లక్షిత దాడులకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com