పాక్ నటీనటులకు నిషేధం విధించిన ఐఎంపిపిఏ
- September 29, 2016
భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సినీ రంగానికి తాకాయి. పాక్ నటులు, టెక్నీషియన్లపై నిషేధం విధిస్తున్న ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ ఆసోసియేషన్(ఐఎంపీపీఏ) తాజాగా ప్రకటన చేసింది. భారత్-పాక్ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఉన్న పాక్ నటీనటులందరూ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇటీవలే శివసేన పార్టీ హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఫవాద్ ఖాన్ గుట్టుచప్పుడు కాకుండా పాకిస్థాన్ వెళ్లిపోయాడు. పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం లక్షిత దాడులకు పాల్పడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలోనే ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









