నవాజ్ షరీఫ్ శాంతి మంత్రం....

- September 30, 2016 , by Maagulf
నవాజ్ షరీఫ్ శాంతి మంత్రం....

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శాంతి మంత్రం వల్లించారు. 'ఇస్లామాబాద్ శాంతిని కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్‌కు ఎవరు కీడు తలపెట్టినా వారి ఆటలు సాగనీయం' అని నవాజ్‌ శుక్రవారంనాడు అన్నారు. జమ్మూకశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితిని తన మంత్రివర్గ సహచరులతో సమీక్షించిన సందర్భంగా నవాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు రేడియా పాకిస్థాన్ పేర్కొంది. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్తున్న పాక్ శాంతిని కోరుకుంటోందని, అయితే మాతృభూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పాకిస్తానీ కంకణబద్ధులై ఉంటారని అన్నారు. దేశం యావత్తూ సైనిక బలగాలకు అండగా నిలుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, పేదరికం, నిరుద్యోగితపై పోరాటానికి పాకిస్తాన్ శాంతిని కోరుకుంటున్నట్టు నవాజ్ తెలిపారు.

ఎల్ఓసీ వెంబడి టెర్రరిస్టు శిబిరాలపై లక్షిత (సర్జికల్) దాడులు జరిపినట్టు భారత్ ప్రకటించిన నేపథ్యంలో నవాజ్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com